Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International Newsపేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే డా.… › e-Paper Clip Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 11 Jan 2026, 12:57 pm  |  Posted by : CHIEF EDITOR HAREESH BABU
👁 34 💬 0
Andhra Pradesh > Kurnool > Latest News

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి

ఎమ్మిగనూరు:
పేద ప్రజలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పాలన అందిస్తోందని ఆయన తెలిపారు.

స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.1.50 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సహాయం అవసరంలో ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు.

కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.