కర్నూలు జిల్లాలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కర్నూలు పోలీస్ పెరేడ్ మైదానంలో అధికారిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి పెరేడ్ను
పరిశీలించారు.సాయుధ పోలీస్ దళాలు, హోంగార్డులు, ఇతర భద్రతా బలగాలు నిర్వహించిన పరేడ్ దేశభక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహపరిచింది. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్, దేశ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రాధాన్యతపై సందేశం ఇచ్చారు.ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రభుత్వ విభాగాల సిబ్బంది, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచే గణతంత్ర దినోత్సవం ప్రతి పౌరుడిలో బాధ్యతాభావాన్ని పెంపొందిస్తుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగింది.
